"భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో"


జనపదు లంత నాగమను జాణ యటంచును నింద సేతురే,

నిజమును సెప్పబూనరు వినిర్మల బుద్దిని; న్యాయశీలి, భే 

షజమును వీడి కావగ సైన్యము నంతయు రాయబారమే

ప్రజలకు మేలు గూర్చు నని, ప్రాణము సైతము లెక్క జేయదే!

భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో.

Comments

Popular posts from this blog

ఉత్సాహ